Friday, May 13, 2016

మళ్లీ వివాదాల్లోకి కావలి మున్సిపాలిటీ

* సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా.... మున్సిపల్ ఛైర్ పర్సన్  సీట్లో అలేఖ్య కూర్చోవడంతో.... కావలి మున్సిపాలిటీ పెనం పై నుంచి పొయ్యి లోకి పడినట్లుగా అయింది.

* మున్సిపల్ నిబంధనలు ప్రకారం....

- మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు.... అజెండా... మినిట్స్ బుక్ .... కమీషనర్ కంట్రోల్ లో ఉంటుంది.

- ఆ పుస్తకాన్ని కమీషనర్ తీసుకుని... ఇన్చార్జి ఛైర్మన్ గా ఉన్న భరత్ కుమార్ చేత... "Hand over"  అని రాసి సంతకం చేయించాలి.

- అనంతరం.... అలేఖ్య.... అదే పుస్తకం లో " Take over"...  అని రాసి సంతకం పెట్టాలి.

- అప్పుడు... అలేఖ్య... కావలి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా భాధ్యత లు స్వీకరించినట్లుగా.... మున్సిపల్ చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది.

* కానీ.... ఈ రోజు  ( 13.05.2016 )  అలేఖ్య విషయంలో ఇవన్నీ ఏమీ జరగలేదు.

* కమీషనర్... ఆఫీస్ పని మీద హైదరాబాద్ కు వెళ్లి ఉన్నారు.  కమీషనర్......కార్యాలయానికి అందుబాటులో లేని రోజు.... కమీషనర్ పనులను... కార్యాలయంలోని మేనేజర్ చూస్తారు.

* అలేఖ్య... మున్సిపల్ కార్యాలయంలోని ఛైర్ పర్సన్ సీట్లో కూర్చున్న సమయంలో.... మేనేజర్ కూడా లేరు.

* అలేఖ్య మాత్రం... BMR Sir ( కావలి తెలుగుదేశం పార్టీ నాయకుడు )  మంత్రి నారాయణ సార్  ఆదేశాల మేరకు తాను ఛైర్ పర్సన్ గా భాధ్యతలు స్వీకరించానని... చెప్పారు.

* శని, ఆదివారం లలో... కార్యాలయానికి సెలవులు. సోమవారం నుంచి అధికారులు కార్యాలయానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.  మళ్లీ తిరకాసు ఏమైనా ఉంటే... సోమవారం కూడా అధికారులు అందుబాటులో లేక పోయినా ఆశ్చర్యపడనవసరం లేదు.

* సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులలో అలేఖ్య మున్సిపల్ ఛైర్ పర్సన్ గా... భాధ్యత లు తీసుకోవచ్చని... స్పష్టంగా చెప్పలేదు.

* కానీ అలేఖ్య మాత్రం.... ఛైర్ పర్సన్ సీట్లో కూర్చొని....ఇద్దరు సార్ ల ఆదేశాల మేరకే భాధ్యత లు తీసుకున్నానని అంటున్నారు.

* కాగా.... మున్సిపల్ ఇన్ఛార్జి ఛైర్మన్ గుండ్లపల్లి భరత్ కుమార్.... పరిస్థితి ఏమిటో... అర్ధం కావడం లేదు.

* అధికారులు మొహం చాటేస్తున్నరంటే..... అలేఖ్య కు కోర్టు ఉత్తర్వులు అనుకూలంగా లేవనేది... క్లియర్ గా తెలుస్తోంది.

* ఏమైనా తేడా వస్తే.... సుప్రీంకోర్టు, హైకోర్టు ల ఉచ్చు లో చిక్కుకోవాల్సి వస్తుందని.... మున్సిపాలిటీ అధికారులు.. భీతిల్లిపోతున్నారు.

* ఇవన్నీ ఇది ఉండగా..... వైకాపా నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి.... మళ్లీ పోరాటానికి అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

* ఒక వైపు సుప్రీంకోర్టు, హైకోర్టు లలో.... అలేఖ్య వ్యవహారం పై కోర్టు ధిక్కరణ పిటీషన్ లు దాఖలు చేయడానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

* ఈ పిటిషన్ లో... మున్సిపల్ అధికారులు ఏ విధంగా ఇరుక్కుంటారో చూడాలి.

* ఈ పిటిషన్ లు దాఖలు.... వాటిపై సుప్రీంకోర్టు, హైకోర్టు ల నుంచి... స్పందనలు.... బుధవారం కానీ, గురువారం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

* దేశంలోని అత్యున్నత న్యాయస్థానాలు... ఎలా స్పందిస్తాయో... చూడాలి.

* ఇక.... కావలి లో వైకాపా నాయకులు, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లతో మాట్లాడి..... కావలి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద.... సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను... పాతర వేస్తున్న వైనం పై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని.... కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్లాన్ చేస్తున్నారు.

* చూద్దాం ఏం జరుగుతుందో...

ఛైర్ పర్సన్ గా భాధ్యతలు స్వీకరించిన అలేఖ్య

కావలి మున్సిపాలిటీ కార్యాలయం లో ఉన్న ఛైర్ పర్సన్ సీట్లో.... అలేఖ్య ఈ రోజు కూర్చున్నారు.

* మున్సిపల్ కమిషనర్.... ఇతర అధికారులు ఎవరూ లేకుండానే... ఆమె... నేరుగా.. ఆమె... ఛైర్ పర్సన్ ఛాంబర్లో కి వచ్చి సీట్లో కూర్చున్నారు.

* ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను పూర్తి స్థాయిలో ఛైర్ పర్సన్ గా భాధ్యతలు స్వీకరించానని వెల్లడించారు.

* ఆమె వెంట కౌన్సిలర్ తోట వెంకటేశ్వర్లు,  తెదేపా పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి అమరా వేదగిరి సుబ్బరాయుడు గుప్తా లు ఉన్నారు.

* అనంతరం... అలేఖ్య తండ్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి యానాది శెట్టి అక్కడికి చేరుకున్నారు.

Thursday, May 12, 2016

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు - ప్రతాప్ రెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో గల పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీలో చేరుతున్నట్లుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు కట్టు కథలేనని ఆయన అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. టీడీపీ నేతలు తనకు పలు రకాలుగా ఆశలు చూపించారని, చివరకు కేసులు పెడతామంటూ బెదిరించారని తెలిపారు. అయితే తాను కేసులకు భయపడేది లేదని, జగన్ వెంటే నడుస్తానని అన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రప్రజల కోసం జలదీక్ష చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం ధనదీక్ష చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతి వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు.

Tuesday, May 10, 2016

అస్వస్థతకు గురైన కావలి ఎమ్మెల్యే

అస్వస్థతకు గురైన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.

* కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారావు.... ఎమ్మెల్యే కు పరీక్షలు చేసి.... మరి కొన్ని పరీక్షలు చేయాలని సూచించారు.

* సక్రమంగా నిద్ర లేకపోవడం, విశ్రాంతి లేకుండా.... ప్రయాణాలు చేయడం వల్లనే... ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అస్వస్థతకు గురైనట్లు తెలిసింది.

Monday, May 9, 2016

కావలి .... మున్సిపల్ ఛైర్ వ్యవహారం రెండు నెలల్లో తేలనుందా ....?

కావలి లో.... మున్సిపల్ ఛైర్ పర్సన్ వ్యవహారం ఉత్సహభరితంగా.... తెలుగు డైలీ సీరియల్ గా మారింది.

* గత ఐదు రోజులుగా..... సుప్రీంకోర్టు.... అలేఖ్య కు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసిందని..... రేపో మాపో..... ఆమె  ఛైర్ పర్సన్ గా భాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగింది.

* అసలు సుప్రీంకోర్టు కోర్టు ఏమి చెప్పిందంటే.....

* ఈ రగడ ను హైకోర్టు లోనే తేల్చుకోవాలని..... ఛైర్ పర్సన్ పదవి ని కోల్పోయిన అలేఖ్య కు.... ఆమె ఛైర్ పర్సన్ పదవి కి అనర్హురాలంటూ న్యాయ పోరాటం చేస్తున్న....కౌన్సిలర్ కేతిరెడ్డి శ్రీలత  ( కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సతీమణి )  ఇరువురికీ స్పష్టంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

* హై కోర్టు కు కూడా.... వీళ్ల పంచాయతీ ని రెండు నెలల్లో..... ముగించాలని.... సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది.

* అసలు ఏమి జరిగిందంటే...

* వైకాపా నుంచి కౌన్సిలర్ గా గెలిచిన అలేఖ్య....తెలుగుదేశం పార్టీ లో చేరిన.... అలేఖ్య... కావలి మున్సిపల్ ఛైర్ పర్సన్ అయ్యారు.

* తమ వైకాపా పార్టీ జారీ చేసిన.... విప్ ను ఉల్లంఘించిన అలేఖ్య ... ఛైర్ పర్సన్ గా అనర్హురాలంటూ..... వైకాపా నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి న్యాయ పోరాటం చేయడం ప్రారంభించారు.

* కావలి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికల అధికారి అయిన కావలి ఆర్డీవో కు... అలేఖ్య పై ఫిర్యాదు చేయడం..... దీంతో ఆమె... ఎన్నికల సంఘం నిబంధనలు ప్రకారం.... ఉల్లంఘనకు పాల్పడ్డారని.... నిర్ధారణకు రావడం.... అలేఖ్య ను ఛైర్ పర్సన్ గా.... అనర్హురాలంటూ ఆర్డీవో ప్రకటించారు.

* అలా.... అలేఖ్య కేవలం రెండు
నెలలు మాత్రమే.... ఛైర్ పర్సన్ గా ఉండి.... పదవిని కోల్పోయారు.

* అలేఖ్య హైకోర్టు కు వెళ్లి ఆర్డీవో తన పై వేసిన వేటుకు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

* హైకోర్టులో ని సింగిల్ జడ్జి.... ఆర్డీవో ఉత్తర్వులను రద్దు చేశారు.

* మళ్లీ అలేఖ్య ఛైర్ పర్సన్ సీటు లో కూర్చొన్నారు.

* సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.... వైకాపా నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి.... హైకోర్టు లోనే డివిజన్ బెంచ్ లో ( ఇద్దరు జడ్జి లు ) పిటిషన్ దాఖలు చేశారు.

* డివిజన్ బెంచ్... సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తూ.... ఆర్డీవో ఉత్తర్వులను యధాతధంగా అమల్లో ఉంచమని ఆదేశాలను జారీ చేసింది.

* అలాగే...ఎన్నికల అధికారి ఆర్డీవో ను.. మళ్లీ నివేదికను అందజేయమని.... కూడా డివిజన్ బెంచ్ చెప్పింది.

* అంటే... అలేఖ్య ఛైర్ పర్సన్ గా, కౌన్సిలర్ గా రెండూ.. పదవులను కోల్పోయారు.

* మళ్లీ అలేఖ్య... డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.... సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.

* సుప్రీంకోర్టు లో అలేఖ్య దాఖలు చేసిన పిటిషన్ సారాంశం ఏమిటంటే.....

హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలలో.... ఆర్డీవో... నివేదిక మళ్లీ పంపే వ్యవహారాన్ని ఆపేయాలని,  తన కౌన్సిలర్, ఛైర్ పర్సన్ పదవి ని తక్షణమే పునరుద్ధరించాలని... అభ్యర్ధించారు.

* అయితే సుప్రీంకోర్టు... అలేఖ్య పిటీషన్ వేయగానే.....ఒక్క కౌన్సిలర్ పదవి లో మాత్రమే కొనసాగమని చెప్పి..... ఏడాది పైగా.... వాయిదాలు వేస్తూ వచ్చింది.

* దీంతో మున్సిపాలిటీ పరిపాలన సౌలభ్యం కోసం... వైస్ చైర్మన్ గుండ్లపల్లి భరత్ కుమార్..... ఇన్చార్జి ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించారు.

* తాజాగా సుప్రీంకోర్టు... ఈ వ్యవహారంపై ఒక ఉత్తర్వులు జారీ చేసింది.

* ఈ ఉత్తర్వులు అధికారికంగా రాక ముందే.... అలేఖ్య ఛైర్ పర్సన్ గా భాధ్యత లు స్వీకరిస్తారని.... తెదేపా వర్గాలు హడావుడి చేశారు.

* ఛైర్ పర్సన్ ఛాంబర్లో నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఛార్జి ఛైర్మన్ గుండ్లపల్లి భరత్ కుమార్ కూడా... ఆ ఛాంబర్ ను ఖాళీ చేసి... తన వైస్ చైర్మన్ గదిలో కి ఆగమేఘాల మీద మారారు. దీంతో ఈ హడావిడి నిజమని జరిగిన ప్రచారానికి... బలం చేకూరింది.

* ఇక సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన కాపీ మున్సిపల్ అధికారులు అందుకొని... చదువుకున్నారు.

* సుప్రీంకోర్టు తాజాగా ఏమి ఆదేశాలు జారీ చేసిందంటే...

* ఈ రగడ ను రెండు నెలల్లో తేల్చేయమని.... హైకోర్టు ను ఆదేశించింది.

* అలాగే హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఈ రెండు నెలలూ అమల్లో ఉంటాయని పేర్కొనింది.

* అంటే అలేఖ్య ఇప్పుడు.... కౌన్సిలర్ గా కూడా కొనసాగరన్న మాట.

* ఎన్నికల అధికారి అయిన కావలి ఆర్డీవో నుంచి కొత్తగా సమగ్రమైన నివేదికను తెప్పించుకొని... తీర్పు చెప్పాలని.... సుప్రీంకోర్టు.... హైకోర్టు కు డైరెక్షన్ ఇచ్చింది.

* సో..... మున్సిపల్ ఇన్ఛార్జి ఛైర్మన్ గా గుండ్లపల్లి భరత్ కుమార్ కొనసాతారు.

* ఈ రెండు నెలలూ అలేఖ్య.... సైలెంట్ గా ఉండిపోవాలి.

* రెండు నెలలు లోగా ఆర్డీవో నివేదిక ను బేస్ చేసుకుని... హైకోర్టు..... అలేఖ్య.... ఛైర్ పర్సన్ పదవి గురించి తీర్పు ఇస్తుంది.

* హైకోర్టు ఇచ్చే తీర్పు పై.... అలేఖ్య కానీ.... కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కానీ.... సుప్రీంకోర్టు ను ఆశ్రయించే అవకాశం ఉంది.

కావలి మున్సిపల్ కౌన్సిల్ కాంట్రాక్టు కమిటీ సమావేశం

కావలి మున్సిపల్ ఇన్ఛార్జి ఛైర్మన్ గుండ్లపల్లి భరత్ కుమార్ అధ్యక్షతన కావలి మున్సిపల్ కౌన్సిల్ కాంట్రాక్టు కమిటీ సమావేశం జరిగింది.

* ఛైర్ పర్సన్ ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన తెదేపా కౌన్సిలర్ లు అమరా విజయలక్ష్మీ, శానం అనూష, పల్లపు పద్మ, శెట్టిపల్లి నిర్మల, వడ్లమూడి వెంకటేశ్వర్లు, ఉప్పు వెంకటస్వామి పాల్గొన్నారు.  మరో సభ్యురాలైన దామా కుసుమ కుమారి గైర్హాజరయ్యారు.

* ఈ మధ్య... ఛైర్ పర్సన్ ఛాంబర్.. ను ఖాళీ చేసిన... ఇన్చార్జి ఛైర్మన్ భరత్ కుమార్... ఈ రోజు జరిగిన కాంట్రాక్టు కౌన్సిల్ కమిటీ సమావేశం ను.... ఛైర్ పర్సన్ ఛాంబర్లో నిర్వహించడం విశేషం.

* ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అన్నవరపు వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు.

Sunday, May 8, 2016

అలఘనాద స్వామి ఉత్సవాలు

అలఘనాద స్వామి దేవస్తానం
ఆత్మకూరు, నెల్లూరు జిల్లా.
 
షుమారు 800 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆత్మకూరు అలఘనాధ స్వామి దేవస్తాన ఉత్సవం ఈ నెల 11వ తేది ఉదయం 9గంటలకు స్వామి వారి కళ్యాణం, మధ్యాహ్నం అన్నదానం  మరియు సాయంకాలం 5 గంటలకు గ్రామోత్సవం అంగరంగ వైబవంగా జరుగును. కావున భక్తులెల్లరు పాల్గొన ప్రార్ధన.
అందరివాడు అలఘనాదుడు   
ఇట్లు ఆలయ కమిటీ

రాత్రి 12 దాటితే పబ్‌లు మూయాల్సిందే

రాత్రి 12 దాటితే పబ్‌లు మూయాల్సిందే
అమలు దిశగా నగర పోలీసుల కార్యాచరణ
హైదరాబాద్‌: నగరంలో ఇక నుంచి రాత్రి 12 తర్వాత పబ్‌లను తప్పనిసరిగా మూయాల్సిందేనని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో బీటెక్‌ విద్యార్థిని కట్కూరి దేవి మృతి ఘటన జరిగిన రోజు ఆమె, భరత్‌ వెళ్లిన గచ్చిబౌలిలోని ‘బీట్స్‌ పర్‌ మినట్‌’ పబ్‌ రాత్రి 2.30గంటల వరకు తెరిచే ఉందని దర్యాప్తులో తేలడంతో పబ్‌ల నిర్వహణ వేళలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అర్ధరాత్రి 12 గంటలకే పబ్‌లు, క్లబ్‌ల్లో సంగీతం నిలిపివేయాలని, ఒంటిగంటలోపు తప్పనిసరిగా వాటిని మూయాల్సిందేనని నగర పోలీస్‌ చట్టంలో ఉన్న నిబంధనను తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటికే నిర్ణీత వేళలు ముగిసిన తర్వాత నడిచే పబ్‌ల కార్యకలాపాలను వీడియో తీసేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు మద్యం తాగి వాహనం నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదంలో ఎవరి మృతికైనా కారకులయ్యే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు నగర పోలీసులు సిద్ధమవుతున్నారు. అలాంటి వారిపై 304(పార్ట్‌-2) ఐపీసీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు.

ఒఁగోలులో మహిళ హత్య

ప్రకాశం జిల్లా .ఒంగోలు టౌన్ లో చావడివారివీధిలో ఆదివారం రాత్రి ఒంటరిగా ఉంటున్న కమలమ్మ (45)అనే మహిళ ఇంట్లో చొరబడిన దోంగలు ఆమెను హత్యచేసి చోరికి పాల్పడ్డారు

టైలర్ అవార్డు

కావలి రెడ్ క్రాస్ లో బక్షుభాయ్ స్మారక టైలర్ అవార్డు కార్యక్రమం

Saturday, May 7, 2016

కావలిలో లేడీ దారుణ హత్య

కావలి రూరల్ మండలం లోని చిన్న పట్టపుపాలెంలో కొండూరు పోలమ్మ అనే మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్ళిన గుర్తు తెలియని దుండగులు