Thursday, February 18, 2016

విశాఖలో పెట్రోలియం వర్శిటీకి కేంద్రం అంగీకారం


విశాఖ: విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్శిటీకి కేంద్రం అంగీకారం తెలిపింది. ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం ఆంధ్రా యూనివర్శిటీతో కేంద్ర పెట్రోలియం శాఖ మూడేళ్లపాటు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

పెట్రోలియం వర్శిటీకి సంబంధించి ఈనెల 4వ తేదీన ఆంధ్రా యూనివర్శిటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగానే పెట్రోలియం వర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించి ఈ ఏడాదిలోనే తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరిపాలన ఇలా అన్ని ప్రక్రియలు మూడేళ్ల పాటు ఏయూ నుంచే నిర్వహించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. మూడు సంవత్సరాల్లో వర్శిటీకి సంబంధించి సొంత భవనాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని అక్కడికి తరలిస్తామని పెట్రోలియం శాఖ పేర్కొంది.

No comments:

Post a Comment